Breaking News

కేసీఆర్ కు అనారోగ్యం.. ఆసుపత్రిలో చేరిక!


Published on: 03 Jul 2025 17:35  IST

బీఆర్ఎస్ అధినేత, మాజీ సీఎం కేసీఆర్ అనారోగ్యం పాలయ్యారు. తీవ్ర సీజనల్ జ్వరం బారిన పడటంతో కేసీఆర్ ను సోమాజిగూడ యశోద ఆసుపత్రిలో చేర్చి చికిత్స అందిస్తున్నారు. ప్రస్తుతం ప్రత్యేక వైద్య బృందం నేతృత్వంలో ఆరోగ్య పరీక్షలు నిర్వహిస్తున్నారు. కాగా కేసీఆర్ అనారోగ్యంపై గులాబీ పార్టీ నాయకులు, శ్రేణులు తీవ్ర ఆందోళన చెందుతున్నారు. యశోద ఆసుపత్రికి భారీగా నాయకులు చేరుకునే అవకాశం ఉంది. కాగా ఆయన ఆరోగ్యంపై వైద్యులు హెల్త్ బులిటెన్ విడుదల చేయాల్సి ఉంది.

Follow us on , &

ఇవీ చదవండి