Breaking News

పది రోజులుగా నల్లాలో కలుషిత నీటి సరఫరా


Published on: 03 Jul 2025 18:31  IST

బాగ్‌అంబర్‌పేట డివిజన్‌ సాయిమధురానగర్‌ నుంచి ఛే నెంబర్‌ వెళ్లే దారిలో గల ఇందిరానగర్‌లో గత పది రోజులుగా నల్లాల్లో కలుషిత నీరు సరఫరా అవుతుందని స్థానికులు వాపోయారు. ఇం.నెం : 2-2-1074/7/బి, షెర్టన్‌ బేకరీ లేన్‌లో గల ఇండ్ల‌లో నలుపు రంగు నీరు సరఫరా అవుతుండడంతో వాటిని తాగలేక బయట నుంచి నీటి ట్యాంకర్లను కొనుక్కోవాల్సి వస్తుందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.నల్లాల్లో కలుషిత మంచినీరు వస్తుందని సంబంధిత వాటర్‌వర్క్స్‌ అధికారులకు ఫిర్యాదు చేసినా పట్టంచుకోవడం లేదన్నారు.

Follow us on , &

ఇవీ చదవండి