Breaking News

పాక్ మద్దతుగా భారత్‌పై ఆయుధాలు ప్రయోగించిన చైనా


Published on: 04 Jul 2025 16:52  IST

భారత డిప్యూటీ ఆర్మీ చీఫ్ లెఫ్టినెంట్ జనరల్ రాహుల్ ఆర్ సింగ్ కీలక వ్యాఖ్యలు చేశారు. భారత్ ఆపరేషన్ సింధూర్ నిర్వహించిన సమయంలో పాకిస్థాన్‌కు చైనా, టర్కీలు మద్దతుగా నిలిచాయన్నారు. శుక్రవారం న్యూఢిల్లీలో ఫిక్కీ ఆధ్వర్యంలో నిర్వహించిన న్యూ ఏజ్ మిలటరీ టెక్నాలజీస్ అనే అంశంపై లెఫ్టినెంట్ జనరల్ రాహుల్ ఆర్ సింగ్ మాట్లాడారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఆపరేషన్ సిందూర్ నిర్వహించిన సమయంలో పాకిస్థాన్‌ను చైనా ఎప్పటికప్పుడు సమాయత్తం చేసిందన్నారు.

Follow us on , &

ఇవీ చదవండి