Breaking News

దేశ వ్యాప్తంగా బంద్..ఈ రాష్ట్రంలో అధిక ప్రభావం..


Published on: 09 Jul 2025 12:16  IST

కేంద్ర ప్రభుత్వం కార్మికులు, రైతులకు వ్యతిరేకంగా అనుసరిస్తున్న వైఖరికి నిరసనగా ట్రేడ్ యూనియన్ సంస్థలు బుధవారం దేశవ్యాప్త బంద్‌కు పిలుపునిచ్చిన సంగతి తెలిసిందే. దేశ వ్యాప్తంగా ఉన్న 10 సెంట్రల్ ట్రేడ్ యూనియన్లు బంద్‌లో పాల్గొన్నాయి. ట్రేడ్ యూనియన్లకు రైతు సంఘాలు సైతం మద్దతుగా నిలిచాయి. దేశ వ్యాప్తంగా దాదాపు 25 కోట్ల మంది ప్రభుత్వ ఉద్యోగులు తమ విధుల్ని బహిష్కరించినట్లు సమాచారం. ఇక, కేరళలో బంద్ ప్రభావం బాగా కనిపిస్తోంది. ప్రజా రవాణా వ్యవస్థ పూర్తిగా ఆగిపోయింది.

Follow us on , &

ఇవీ చదవండి