Breaking News

యూరియాపై సీఎం రేవంత్‌రెడ్డి విజ్ఞప్తి..


Published on: 09 Jul 2025 16:10  IST

ఖరీఫ్ సీజన్‌లో తమ రాష్ట్రంలో యూరియాకు గరిష్టంగా డిమాండ్ ఉంటుందంటూ కేంద్రమంత్రి జేపీ నడ్డాకి తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి విజ్ఞప్తి చేశారు. ఖరీఫ్ సీజన్‌లో సరిపడా యూరియా తెలంగాణకు కేంద్రప్రభుత్వం ఇవ్వాలని రేవంత్‌రెడ్డి కోరారు. అయితే సీఎం విజ్ఞప్తిని పరిగణనలోకి తీసుకున్నామని తెలిపారు. తెలంగాణ రాష్ట్ర రైతుల డిమాండ్‌ను నెరవేర్చే దిశగా అధికారులకు ఆదేశాలు జారీ చేశారు కేంద్రమంత్రి జేపీ నడ్డా. ఇవాళ (బుధవారం) ఢిల్లీలో జేపీ నడ్డా మీడియాతో మాట్లాడారు.

Follow us on , &

ఇవీ చదవండి