Breaking News

రష్యా చమురును భారత్‌ కొనకపోయి ఉంటే..


Published on: 11 Jul 2025 15:14  IST

ఉక్రెయిన్‌పై యుద్ధం సాగిస్తున్న రష్యాపై పశ్చిమ దేశాలు ఆంక్షలు విధించిన సంగతి తెలిసిందే. అయినప్పటికీ మాస్కో నుంచి భారత్‌ చమురు కొనుగోలు చేయడంపై అప్పట్లో అభ్యంతరాలు వ్యక్తమయ్యాయి.దీనిపై న్యూదిల్లీ ఎప్పటికప్పుడు స్పష్టతనిస్తూనే ఉంది. తాజాగా కేంద్ర పెట్రోలియం, సహజ వాయువు శాఖ మంత్రి హర్‌దీప్‌ సింగ్ పురి స్పందించారు. రష్యా నుంచి చమురు కొని తాము ప్రపంచ ఆర్థిక వ్యవస్థకు మేలు చేశామన్నారు . లేదంటే అంతర్జాతీయ మార్కెట్లో ధరలు ఆకాశన్నంటేవని తెలిపారు.

Follow us on , &

ఇవీ చదవండి