Breaking News

హెచ్‌సీఏ స్కామ్.. రంగంలోకి ఈడీ


Published on: 11 Jul 2025 15:37  IST

హెచ్‌‌సీఏలో అవకతవకలపై ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ రంగంలోకి దిగింది. హెచ్‌సీఏపై నమోదు చేసిన కేసు వివరాలు ఇవ్వాలని సీఐడీకి ఈడీ లేఖ రాసింది. ఎఫ్‌ఐఆర్, రిమాండ్ రిపోర్టు, కేసు వివరాలు, వాంగ్మూలాలు ఇవ్వాలని కోరింది. సీఐడీ నమోదు చేసిన ఎఫ్‌ఐఆర్ ఆధారంగా ఈడీ ఈసీఐఆర్ నమోదు చేయనుంది. కాగా.. హెచ్‌సీఏ స్కామ్‌పై ఓవైపు సీఐడీ దర్యాప్తు కొనసాగుతోంది. ఇప్పటికే ఈ స్కామ్‌కు సంబంధించి ఐదుగురు నిందితులను అరెస్ట్ చేసి జ్యుడీషియల్ రిమాండ్‌కు తరలించారు.

Follow us on , &

ఇవీ చదవండి