Breaking News

ఆరు అంతస్తుల భవనం అకస్మాత్తుగా కుప్పకూలిపోయింది

ఢిల్లీలో ముస్తఫాబాద్ ప్రాంతంలో తీవ్ర విషాదం చోటుచేసుకుంది. ఓ ఆరు అంతస్తుల భవనం అకస్మాత్తుగా కుప్పకూలిపోయింది. ఈ దుర్ఘటనలో నలుగురు ప్రాణాలు కోల్పోయారు.


Published on: 19 Apr 2025 14:21  IST

న్యూఢిల్లీ, ఏప్రిల్ 19: దేశ రాజధానిలోని ముస్తఫాబాద్ ప్రాంతంలో తీవ్ర విషాదం చోటుచేసుకుంది. శనివారం తెల్లవారుజామున ఓ ఆరు అంతస్తుల భవనం అకస్మాత్తుగా కుప్పకూలిపోయింది. ఈ దుర్ఘటనలో నలుగురు ప్రాణాలు కోల్పోయారు.

పలువురు ఈ శిథిలాల కింద చిక్కుకుపోయినట్టు సమాచారం. విషయం తెలుసుకున్న వెంటనే పోలీసులు మరియు ఎన్డీఆర్‌ఎఫ్ (NDRF) బృందాలు ఘటనాస్థలికి చేరుకుని సహాయక చర్యలు ప్రారంభించాయి. శిథిలాల క్రింద ఉన్నవారిని బయటకు తీసేందుకు రంగంలోకి దిగాయి.

గాయపడిన వారిని ఆసుపత్రికి తరలించారు. ఘటనాస్థలంలో సహాయక చర్యలు ప్రస్తుతం కూడా జోరుగా కొనసాగుతున్నాయి. స్థానికులు కూడా సహాయానికి ముందుకొచ్చారు.

ఈ ఘటన తీవ్ర ఆందోళనకు గురిచేస్తోంది. భవన కూలిపోవడానికి గల కారణాలు ఇంకా తెలియరాలేదు. అధికారుల దర్యాప్తు కొనసాగుతోంది.

Follow us on , &

ఇవీ చదవండి