Breaking News

మధ్యప్రదేశ్‌లో కూలీ దంపతులకు దొరికిన 8 వజ్రాలు..


Published on: 25 Jul 2025 16:59  IST

ఆ దంపతులు ఇద్దరూ కూలీలు. వాళ్లు గత ఐదేళ్లుగా పన్నా లోని నిసార్‌ గని లో పనిచేస్తున్నారు. కేవలం కూలీ డబ్బులతోనే వారు జీవనం సాగిస్తూ వస్తున్నారు. అయితే ఐదేళ్ల సుదీర్ఘ వెతుకులాట తర్వాత ఇప్పుడు వారి కష్టం ఫలించింది. తాజాగా వారికి ఒకటి కాదు, రెండు కాదు, ఏకంగా 8 వజ్రాలు (Eight diamonds) దొరికాయి. వాటి విలువ ఏకంగా రూ.12 లక్షలు ఉంటుందని సంబంధిత అధికారులు అంచనా వేస్తున్నారు.

Follow us on , &

ఇవీ చదవండి