Breaking News

విశాఖపట్నంలో ఆర్టీసీ కీలక నిర్ణయం, జస్ట్ రూ.100కు రోజు మొత్తం జర్నీ

విశాఖపట్నం ఆర్టీసీ ప్రయాణికులకు అదిరిపోయే ఆఫర్ ప్రకటించింది. కేవలం రూ.100కే రోజంతా నగరంలో ఎక్కడి నుంచైనా ఎక్కడికైనా ప్రయాణించేందుకు 'ట్రావెల్ యాజ్ యూ లైక్' టికెట్‌ను అందుబాటులోకి తెచ్చింది. మహిళలకు ఉచిత ప్రయాణ పథకం ఉన్నప్పటికీ, కుటుంబంతో వచ్చినప్పుడు ఇతరులకు ఈ టికెట్ ఎంతో ఉపయోగకరంగా ఉంటుందని ఆర్టీసీ అధికారులు తెలిపారు


Published on: 25 Aug 2025 11:01  IST

విశాఖపట్నంవాసులకు, నగరానికి వచ్చే పర్యాటకులకు ఆర్టీసీ బంపరాఫర్ ప్రకటించింది. 'ట్రావెల్ యాజ్ యూ లైక్' పేరుతో జస్ట్ రూ.100కే రోజు మొత్తం నగరంలో ఎక్కడి నుంచైనా ఎక్కడికైనా ప్రయాణం చేయొచ్చు. ఈ టికెట్ ద్వారా డబ్బు కూడా ఆదా అవుతుందని ఆర్టీసీ అధికారులు చెబుతున్నారు. ఏపీ ప్రభుత్వం ప్రస్తుతం స్త్రీశక్తి పథకం కింద మహిళలకు సిటీ ఆర్డినరీ, మెట్రో సర్వీసుల్లో ఉచిత ప్రయాణం అమలు చేస్తోంది. అయితే ఒకవేళ కుటుంబంతో విశాఖపట్నం వచ్చినప్పుడు మహిళలు కాకుండా మిగిలిన వాళ్ళు ఈ టికెట్ కొనుక్కొని నగరాన్ని చూడవచ్చు. ఆర్టీసీ తీసుకొచ్చిన ఈ టికెట్‌ కొనుగోలు చేస్తే డబ్బులు ఆదా చేయడంతో పాటుగా నగర పరిధిలో ఎక్కడి నుంచి ఎక్కడికైనా సులభంగా ప్రయాణం చేయొచ్చు. ఒక రోజంతా ఈ టికెట్ ఉపయోగించుకోవచ్చని చెబుతోంది ఆర్టీసీ. విశాఖపట్నంలో సందర్శనీయ ప్రాంతాలను వీక్షించాలనుకునే పర్యాటకులకు ఇది మంచి అవకాశం. ఆర్టీసీ తీసుకొచ్చిన ఈ రూ.100 ‘ట్రావెల్‌ యాజ్‌ యూ లైక్‌’ టికెట్‌ ఉంటే చాలు.

ఈ రూ.100 ‘ట్రావెల్‌ యాజ్‌ యూ లైక్‌’ టికెట్‌‌ సిటీలో తిరిగే ఆర్డినరీ, మెట్రో బస్సుల్లో ఈ టికెట్ సేవలు అందుబాటులో ఉన్నాయి. బస్సు ఎక్కిన వెంటనే కండక్టర్ దగ్గర టికెట్ తీసుకోవచ్చు. కండక్టర్ టిమ్ యంత్రంలో కొన్ని వివరాలు నమోదు చేసిన వెంటనే ఈ బస్ టికెట్ ఇస్తారు. నగరంలో ప్రతిరోజు ప్రజలు పనులపై వస్తుంటారు. ఆస్పత్రులకు వచ్చేవాళ్లు, వ్యాపారాలకు సంబంధించిన పనులుపై వచ్చేవాళ్లు, పర్యాటక ప్రాంతాలను చూద్దామనుకునేవారు ఇలా వందలలమంది ఈ టికెట్లు కొనుగోలు చేస్తున్నట్లు అధికారులు చెబుతున్నారు. రూ.100తో రోజంతా సిటీలో ఎక్కడి నుంచి ఎక్కడికైనా ప్రయాణం చేయొచ్చు. విశాఖపట్నం వచ్చే పర్యాటకులతో పాటుగా స్థానికులకు ఈ ‘ట్రావెల్‌ యాజ్‌ యూ లైక్‌ మంచి అవకాశం. రాష్ట్రవ్యాప్తంగా ప్రభుత్వం మహిళలకు ఉచిత బస్సు పథకం కూడా అమలు చేస్తున్నారు. ఈ క్రమంలో ఫ్యామిలీతో కలిసి విశాఖఫట్నం వచ్చేవారికి ఈ టికెట్ బాగా ఉపయోగపడుతుంది అంటున్నారు అధికారులు.

Follow us on , &

ఇవీ చదవండి