Breaking News

కేంద్రానికి, తెలంగాణ ప్రభుత్వానికి నోటీసులు


Published on: 29 Aug 2025 17:47  IST

లంబాడీ, సుగాలీ, బంజారాలను ఎస్టీ జాబితాలో చేర్చటంపై గతంలో తెలంగాణ హైకోర్టులో తెల్లం వెంకట్రావు పిటిషన్ వేశారు. ఈ పిటిషన్‌ను హైకోర్టు తోసిపుచ్చింది. దీంతో హైకోర్టు నిర్ణయాన్ని సవాలు చేస్తూ తెల్లం వెంకట్రావు సుప్రీంకోర్టును ఆశ్రయించారు. లంబాడీ, సుగాలీ, బంజారాలను ఎస్టీ జాబితాలో నుంచి తొలగించాలంటూ సుప్రీంకోర్టులో పిటిషన్ వేశారు.ఈ నేపథ్యంలోనే సుప్రీంకోర్టు ధర్మాసనం కేంద్రం, తెలంగాణ ప్రభుత్వానికి నోటీసులు జారీ చేసింది.

Follow us on , &

ఇవీ చదవండి