Breaking News

ఒక్కో కుటుంబానికి తక్షణమే రూ.3 వేలు ఇవ్వండి..


Published on: 27 Oct 2025 18:08  IST

మొంథా తుపానుపై కలెక్టర్లు, ఎస్పీలతో సీఎం చంద్రబాబు టెలీకాన్ఫరెన్స్‌ నిర్వహించారు. పునరావాస కేంద్రాల్లో అన్ని సదుపాయాలు కల్పించాలని సీఎం ఆదేశించారు. ఒక్కో కుటుంబానికి రూ.3 వేలు చొప్పున ఇవ్వాలని సీఎం ఆదేశించారు. అంతేకాకుండా కుటుంబానికి 25 కిలోల బియ్యం, నిత్యావసరాలు పంపిణీ చేయాలని సూచించారు. పునరావాస కేంద్రాల్లో వైద్య శిబిరాలు నిర్వహించాలన్నారు. అత్యవసర వైద్యసేవలు అందించే సిబ్బంది అందుబాటులో ఉండాలని ఆదేశించారు.

Follow us on , &

ఇవీ చదవండి