Breaking News

శ్రీ చరణి శుక్రవారం చంద్రబాబును కలిశారు.

భారత మహిళల క్రికెట్ జట్టు సభ్యురాలు, ఆంధ్రాకు చెందిన ఎన్. శ్రీ చరణి శుక్రవారం (నవంబర్ 7, 2025) నాడు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడును కలిశారు. ఐసీసీ మహిళల వన్డే ప్రపంచకప్‌ 2025 గెలిచిన భారత జట్టులో శ్రీ చరణి కూడా భాగం.


Published on: 07 Nov 2025 12:55  IST

భారత మహిళల క్రికెట్ జట్టు సభ్యురాలు, ఆంధ్రాకు చెందిన ఎన్. శ్రీ చరణి శుక్రవారం (నవంబర్ 7, 2025) నాడు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడును కలిశారు. ఐసీసీ మహిళల వన్డే ప్రపంచకప్‌ 2025 గెలిచిన భారత జట్టులో శ్రీ చరణి కూడా భాగం. శ్రీ చరణితో పాటు భారత మాజీ కెప్టెన్ మిథాలీ రాజ్ కూడా చంద్రబాబును కలిశారు.ఉండవల్లిలోని క్యాంప్ కార్యాలయంలో జరిగిన ఈ సమావేశంలో మంత్రి నారా లోకేష్ కూడా పాల్గొన్నారు.ప్రపంచకప్ విజయాన్ని సాధించినందుకు శ్రీ చరణిని చంద్రబాబు అభినందించారు.తాను సాధించిన విజయాన్ని, జట్టుతో పంచుకున్న ఆనంద క్షణాలను శ్రీ చరణి వారితో పంచుకున్నారు.ప్రపంచకప్‌లో ఏపీకి చెందిన క్రీడాకారిణి విజయం సాధించడం గర్వకారణంగా ఉందని సీఎం చంద్రబాబు పేర్కొన్నారు.

Follow us on , &

ఇవీ చదవండి