Breaking News

బస్ భవన్‌‌ను ముట్టడించిన కార్మికులు..


Published on: 05 May 2025 18:16  IST

ఆర్టీసీ కార్మికులు సమ్మెకు పిలుపు నిచ్చిన నేపథ్యంలో సోమవారం వారు కవాతు నిర్వహించారు. అందులోభాగంగా హైదరాబాద్ ఆర్టీసీ క్రాస్ రోడ్డు వద్దనున్న బస్ భవన్‌ను తెలంగాణ ఆర్టీసీ కార్మికులు సోమవారం ముట్టడించారు. దీంతో బస్ భవన్ వద్ద ఉద్రిక్తత పరిస్థితి నెలకొంది. మరోవైపు సమ్మె యధా విధిగా కొనసాగుతోందని ఆర్టీసీ జేఏసీ ప్రకటించింది. తమతో చర్చలకు ఆర్టీసీ యాజమాన్యం పిలవకపోవడంపై జేఏసీ నేతలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. మంగళవారం అర్థరాత్రి నుంచి బస్సులు ఎక్కడివక్కడ నిలిచిపోతాయని చెప్పారు. 

Follow us on , &

ఇవీ చదవండి