Breaking News

రాప్తాడుకు బంగారు భవిష్యత్తు..


Published on: 18 Nov 2025 15:15  IST

రేమండ్స్‌ పరిశ్రమ రాకతో రాప్తాడు భవిష్యత్తుకు బంగారు బాటలు పడ్డాయని ఎమ్మెల్యే పరిటాల సునీత అన్నారు. జాకీ పరిశ్రమ స్థానంలో రేమండ్స్‌ వస్త్ర పరిశ్రమ మంజూరు చేసిన నేపథ్యంలో సోమవారం రాప్తాడు సమీపంలో పరిశ్రమ ఏర్పాటుకు కేటాయించిన స్థలంలో కూటమి ప్రభుత్వానికి కృతజ్ఞత సభ నిర్వహించారు. కార్యక్రమానికి ఎమ్మెల్యే పరిటాల సునీత, టీడీపీ శ్రీ సత్యసాయి జిల్లా అధ్యక్షుడు అంజనప్ప, ధర్మవరం నియోజకవర్గం ఇన్‌చార్జ్‌ పరిటాల శ్రీరామ్‌ హాజరయ్యారు.

Follow us on , &

ఇవీ చదవండి