Breaking News

అక్రమాస్తుల కేసులో రేపు కోర్టుకు జగన్‌


Published on: 19 Nov 2025 11:21  IST

అక్రమాస్తుల కేసులో వైసీపీ అధినేత వైఎస్‌ జగన్ ఈ నెల 20న సీబీఐ ప్రత్యేక కోర్టుకు హాజరవాల్సి ఉంది. లండన్ పర్యటనలో తప్పు ఫోన్ నంబర్ ఇవ్వడంతో కోర్టు అసంతృప్తి వ్యక్తం చేసి, వ్యక్తిగత హాజరు తప్పనిసరి చేసింది. ఇప్పటి వరకు వివిధ సాకులతో వాయిదాలు కోరిన జగన్‌కు ఈసారి మినహాయింపు లభించలేదు.ఈ విచారణ కేసు పురోగతికి కీలకంగా మారనుంది. కోర్టు సూచనల నేపథ్యంలో జగన్ హాజరుపై రాజకీయ వర్గాల్లో ఆసక్తి నెలకొంది. విచారణ తర్వాత తదుపరి చర్యలు స్పష్టత వచ్చే అవకాశం ఉంది.

Follow us on , &

ఇవీ చదవండి