Breaking News

తిండి లేక అనారోగ్యంతో కొడుకు మృతి

మహబూబ్‌నగర్ (పాలమూరు) జిల్లాలో చోటుచేసుకున్న హృదయవిదారక ఘటనలో సరైన తిండి లేక అనారోగ్యానికి గురై ఎనిమిదేళ్ల దివ్యాంగుడైన కుమారుడు హరీష్ మృతి చెందాడు


Published on: 19 Nov 2025 15:07  IST

మహబూబ్‌నగర్ (పాలమూరు) జిల్లాలో చోటుచేసుకున్న హృదయవిదారక ఘటనలో సరైన తిండి లేక అనారోగ్యానికి గురై ఎనిమిదేళ్ల దివ్యాంగుడైన కుమారుడు హరీష్ మృతి చెందాడు. 

మహబూబ్‌నగర్‌లోని ప్రేమ్‌నగర్‌కు చెందిన బాలరాజ్ అనే వ్యక్తి పత్తి మిల్లులో పని చేస్తూ కుటుంబాన్ని పోషించేవాడు. ఏడాది క్రితం మిల్లు మూతపడటంతో ఉపాధి కోల్పోయాడు.దీంతో బాలరాజ్‌ భార్య, చిన్న కుమారుడిని వదిలేసి పుట్టింటికి వెళ్లిపోయింది. అప్పటినుండి బాలరాజ్ స్థానికంగా ఓ హోటల్‌లో పని చేస్తూ దివ్యాంగుడైన పెద్ద కుమారుడు హరీష్‌ను పోషిస్తున్నాడు.కుమారుడు అనారోగ్యంతో మృతి చెందగా, అంత్యక్రియలు నిర్వహించడానికి బాలరాజ్ వద్ద డబ్బులు లేకపోవడంతో, మృతదేహాన్ని భుజాన వేసుకొని శ్మశానానికి వెళ్లాడు. అక్కడ సాయం కోసం ఎదురుచూస్తూ మృతదేహాన్ని ఒడిలో పెట్టుకొని దాదాపు ఐదు నుంచి ఎనిమిది గంటలపాటు రోదిస్తూ కూర్చుండిపోయాడు.

ఈ విషాద సంఘటన స్థానికులను, పోలీసులను కలచివేసింది. వారు బాలరాజుకు సహాయం అందించి, చిన్నారి అంత్యక్రియలు పూర్తయ్యేలా చూశారు.ఈ సంఘటన తీవ్ర పేదరికం, కుటుంబ పరిస్థితులు, దివ్యాంగుల సంరక్షణలో ప్రభుత్వ, సామాజిక మద్దతు లోపాలను కళ్ళకు కట్టినట్లు చూపింది.

Follow us on , &

ఇవీ చదవండి