Breaking News

రేవంత్ సర్కార్‌పై కేటీఆర్ సీరియస్


Published on: 25 Nov 2025 18:09  IST

అవినీతి కోసమే హెచ్‌ఐఎల్‌టీపీ పాలసీని కాంగ్రెస్ ప్రభుత్వం, సీఎం రేవంత్ తీసుకువచ్చారని మాజీ మంత్రి కేటీఆర్ వ్యాఖ్యలు చేశారు. మంగళవారం మీడియాతో మాట్లాడుతూ.. కాంగ్రెస్ ప్రభుత్వం 5 లక్షల కోట్ల అవినీతి స్కీంకు తెర లేపిందని ఆరోపించారు. 9,292 ఎకరాల భూమి దారాదత్తం చేసేందుకు HILTP పాలసీని తీసుకువచ్చిందని విమర్శించారు. ఉద్యోగ, ఉపాధ్యాయ అవకాశాల కోసం ప్రజల నుంచి సేకరించిన ప్రభుత్వ భూమిని అతి తక్కువ ధరకి పారిశ్రామిక వ్యక్తులకు గత ప్రభుత్వాలు ఇచ్చాయని గుర్తుచేశారు.

Follow us on , &

ఇవీ చదవండి