Breaking News

కేంద్ర కేబినెట్ కీలక నిర్ణయాలు


Published on: 26 Nov 2025 18:53  IST

ప్రధాని నరేంద్ర మోదీ అధ్యక్షతన కేంద్ర కేబినెట్ బుధవారం న్యూఢిల్లీలో సమావేశమైంది. ఈ సందర్భంగా తీసుకున్న నిర్ణయాలను కేంద్ర రైల్వే శాఖ మంత్రి అశ్వినీ వైష్ణవ్ విలేకర్ల సమావేశంలో వెల్లడించారు. రేర్ ఎర్త్ మ్యాగ్నెట్ ప్రొడక్షన్‌ (REMP)కు రూ.7,280 కోట్లు కేటాయించిందని తెలిపారు. పుణె నగరంలో మెట్రో రైలు పొడిగింపునకు రూ.9,858 కోట్లు కేటాయించినట్లు వివరించారు. దేవభూమి ద్వారక - కర్నాలస్ రైల్వే లైన్ డబ్లింగ్‌ పనులకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చిందన్నారు.

Follow us on , &

ఇవీ చదవండి