Breaking News

విరాట్‌ దంచేశాడు


Published on: 01 Dec 2025 11:02  IST

దక్షిణాఫ్రికాతో రెండు టెస్ట్‌ల్లో వైట్‌వాష్‌ అయిన భారత్‌ వన్డే సిరీ్‌సలో పుంజుకుంది. రోహిత్‌, కోహ్లీ జోడీ ధనాధన్‌ బ్యాటింగ్‌తో విజృంభించిన వేళ 17 పరుగులతో సఫారీలను ఓడించింది. ఆదివారం ఉత్కంఠగా జరిగిన తొలి వన్డేలో మొదట భారత్‌ 50 ఓవర్లలో 349/8 స్కోరు చేసింది. కోహ్లీ (120 బంతుల్లో 11 ఫోర్లు, 7 సిక్స్‌లతో 135) సెంచరీతో చెలరేగగా, కెప్టెన్‌ కేఎల్‌ రాహుల్‌ (56 బంతుల్లో 2 ఫోర్లు, 3 సిక్స్‌లతో 60), రోహిత్‌ (51 బంతుల్లో 5 ఫోర్లు, 3 సిక్స్‌లతో 57) అర్ధ శతకాలతో మెరిశారు.   బార్ట్‌మన్‌, బర్గర్‌, బాష్‌, యాన్సెన్‌ తలా రెండు వికెట్లు పడగొట్టారు.

Follow us on , &

ఇవీ చదవండి