Breaking News

ధాన్యం డబ్బులు ఇవ్వండి మహాప్రభో..


Published on: 01 Dec 2025 15:35  IST

ప్రభుత్వ కొనుగోలు కేంద్రాల ద్వారా సేకరించిన ధాన్యానికి సంబంధించి నగదు చెల్లింపుల్లో తీవ్ర జాప్యం జరుగుతున్నట్లు రైతులు ఆరోపిస్తున్నారు. వివరాల్లోకి వెళ్తే.. మేడ్చల్‌-మల్కాజిగిరి జిల్లాలో ఏర్పాటు చేసిన 15 ప్రభుత్వ ధాన్యం కొనుగోలు కేంద్రాలలో ఇప్పటివరకు 5,650 మెట్రిక్‌ టన్నుల ధాన్యాన్ని కొనుగోలు చేయగా.. రైతులకు రూ.13 కోట్ల 78 లక్షలు చెల్లించాల్సి ఉండగా ఇప్పటి వరకు రూ.65 లక్షలు మాత్రమే చెల్లించారు. మిగతా వారికి త్వరలోనే వారి ఖాతాలలో నగదు జమ చేస్తామని అధికారులు చెపుతున్నారు.

Follow us on , &

ఇవీ చదవండి