Breaking News

అతీత శక్తుల పేరుతో రూ.3.5 కోట్ల బురిడీ..


Published on: 01 Dec 2025 16:10  IST

తనకు అతీత శక్తులున్నాయని నమ్మించిన ఓ కేటుగాడు వనపర్తి జిల్లా పెబ్బేరులోని దంపతుల నుంచి రూ.3.50 కోట్లు దండుకొని ముఖం చాటేశాడు .నాలుగేండ్ల పాటు జరిగిన ఈ తతంగమంతా రెండు రోజుల క్రితం వెలుగు చూసింది. బాధితులు ఆదోని పోలీసులను సంప్రదించగా, పట్టించుకోకపోవడంతో అక్కడి ఎమ్మెల్యే పార్థసారథిరెడ్డికి గోడు వెళ్లబోసుకున్నారు. వీరిని మోసం చేసిన వ్యక్తి ఆదోని మండలం బైచిగేరిలో దుర్గాసింగ్‌ ఫౌండేషన్‌ చారిటబుల్‌ ట్రస్టు పేరుతో సామాజిక కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్టు తెలిసింది. 

Follow us on , &

ఇవీ చదవండి