Breaking News

భారత్‌-పాక్‌ యుద్ధ భయాలు. నష్టాల్లో మార్కెట్‌ సూచీలు


Published on: 09 May 2025 10:02  IST

భారత్–పాకిస్థాన్‌ల మధ్య ఉద్రిక్తతల ప్రభావంతో శుక్రవారం దేశీయ స్టాక్ మార్కెట్లు నష్టాల్లో ట్రేడవుతున్నాయి. ఉదయం 9.30కి సెన్సెక్స్‌ 591 పాయింట్లు తగ్గి 79,743 వద్ద, నిఫ్టీ 210 పాయింట్లు నష్టపోయి 24,063 వద్ద కొనసాగింది. రూపాయి మారకం విలువ 30 పైసలు తగ్గి 85.88 వద్దకు చేరింది. భారత్ సైన్యం ‘ఆపరేషన్‌ సిందూర్‌’లో భాగంగా పాక్‌ గగనతల రక్షణ వ్యవస్థను లక్ష్యంగా చేసుకున్న ఘటనలు, యుద్ధ భయాలు మార్కెట్లపై ప్రతికూల ప్రభావం చూపాయి.

Follow us on , &

ఇవీ చదవండి