Breaking News

జీపీఎస్ స్పూఫింగ్‌పై రామ్మోహన్ నాయుడు క్లారిటీ


Published on: 01 Dec 2025 19:00  IST

ఢిల్లీ విమానాశ్రయంలో జీపీఎస్ స్పూఫింగ్‌పై వైసీపీ ఎంపీ నిరంజన్‌రెడ్డి అడిగిన ప్రశ్నకు కేంద్ర విమానాయన శాఖ మంత్రి రామ్మోహన్ నాయుడు (Union Minister Rammohan Naidu) సమాధానం ఇచ్చారు. ఇటీవల ఢిల్లీ విమానాశ్రయంలో ల్యాండింగ్ సమయంలో జీపీఎస్ స్పూఫింగ్ జరిగిందని ఫ్లైట్స్ రిపోర్ట్స్ వచ్చాయని.. కంటెంజెన్సీ ప్రొసీజర్స్ ద్వారా ఈ పరిస్థితిని అధిగమించాయని తెలిపారు. జీపీఎస్ స్పూఫింగ్‌తో విమానాల రాకపోకలకు ఎలాంటి అంతరాయం కలగలేదని చెప్పుకొచ్చారు రామ్మోహన్ నాయుడు.

Follow us on , &

ఇవీ చదవండి