Breaking News

యాసంగి వడ్లకు బోనస్‌ చెల్లించాలి


Published on: 02 Dec 2025 16:09  IST

యాసంగి వడ్లకు ప్రభుత్వం వెంటనే బోనస్‌ చెల్లించాలని నర్సంపేట మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్‌రెడ్డి డిమాండ్‌ చేశా రు. సోమవారం వరంగల్‌ జిల్లా ఖానాపురంలో మీడియాతో మాట్లాడారు. కాం గ్రెస్‌ పార్టీ అసెంబ్లీ ఎన్నికలకు ముందు వరంగల్‌ డిక్లరేషన్‌ పేరుతో రైతులకు ఇచ్చిన ఏ ఒక్క హామీని అమలు చేయలేదని మండిపడ్డారు. రైతు పండించిన అన్ని రకాల పంటలకు బోనస్‌ చెల్లిస్తామని మ్యానిఫెస్టోలో పెట్టి కేవలం సన్న వడ్లకు మాత్రమే ఇస్తామని రైతులను మోసం చేసిందని ఆరోపించారు.

Follow us on , &

ఇవీ చదవండి