Breaking News

ప్రాణాలు తీసిన పొగమంచు..


Published on: 03 Dec 2025 16:42  IST

మండల పరిధిలోని గుడ్డంపల్లి గ్రామానికి చెందిన కృష్ణారెడ్డి(41), జ్యోతి(35) దంపతులు కర్ణాటకలో జరిగిన రోడ్డు ప్రమాదంలో మృతిచెందారు. వారి కుమారుడు మధుసూదన్‌ రెడ్డి, మరో వ్యక్తి చిదంబర రెడ్డి గాయపడ్డారు. పొగమంచు కారణంగా రోడ్డు కనిపించకపోవడంతో హొసకేరి వద్ద కారు డివైడర్‌ను ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో దంపతులు ఇద్దరూ అక్కడికక్కడే మృతి చెందారు. తల్లిదండ్రుల మృతితో ఇద్దరు కుమారులు దిక్కులేనివారయ్యారు. ఈ ప్రమాదంతో గ్రామంలో తీవ్ర విషాదం అలుముకుంది.

Follow us on , &

ఇవీ చదవండి