Breaking News

రేషన్‌కార్డుదారులకు మరో శుభవార్త..


Published on: 08 Dec 2025 18:50  IST

ఏపీలో రేషన్ కార్డు ఉన్నవారికి పౌరసరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ శుభవార్త అందించారు. జనవరి 1 నుంచి రాగులు, గోధుమ పిండి ఉచితంగా పంపిణీ చేస్తామని వెల్లడించారు. ఇక పీడీఎస్ బియ్యానికి సైతం క్యూఆర్ కోడ్ అమర్చేలా జనవరి నుంచి కొత్త విధానాన్ని అమల్లోకి తీసుకొస్తున్నట్లు తెలిపారు. ఇవాళ ఢిల్లీలో కేంద్ర పౌరసరఫరాల శాఖ మంత్రి ప్రహ్లాద్ జోషిని మంత్రి నాదెండ్ల మనోహర్, రాష్ట్ర పౌరసరఫరాల శాఖ కమిషనర్ సౌరభ్ గౌర్ కలిశారు. ధాన్యం కొనుగోళ్లపై చర్చించారు.

Follow us on , &

ఇవీ చదవండి