Breaking News

నగరంలో మరో దారుణ హత్య..


Published on: 10 Dec 2025 15:05  IST

హైదరాబాద్‌ నగరంలో మరో దారుణ హత్య జరిగింది. రెండు రోజుల క్రితం మేడ్చల్ మల్కాజ్‌గిరి జిల్లా జవహర్ నగర్ పరిధిలోని ఫాస్టర్ బిలభాంగ్స్ స్కూల్ ముందు వెంకటరత్నం అనే రియల్ ఎస్టేట్ వ్యాపారిని కత్తులతో దారుణంగా హతమార్చిన ఘటనను మరువకముందే కామాటిపుర పోలీస్‌స్టేషన్‌ పరిధిలో మరో హత్య జరిగింది.దేవిబాగ్ వద్ద అరవింద్ ఘోస్లే (30) అనే వ్యక్తిని వెంబడించి కత్తులతో నరికి చంపారు. ఓ మహిళతో వివాహేతర సంబంధం కారణంగానే ఈ హత్య జరిగినట్లు పోలీసులు అనుమానిస్తున్నారు.

Follow us on , &

ఇవీ చదవండి