Breaking News

మంత్రులు ఇలా చేస్తే సహించేది లేదు..


Published on: 11 Dec 2025 14:16  IST

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఆధ్వర్యంలో ఏపీ మంత్రి మండలి సమావేశం ఇవాళ(గురువారం) జరగుతోంది. ఈరోజు ఉదయం 10:30కు కేబినెట్ భేటీ ఏపీ సచివాలయంలో ప్రారంభమైంది. మొత్తం 44 అంశాలపై మంత్రి మండలి సమావేశంలో ముఖ్యమంత్రి చర్చిస్తున్నారు.అయితే, కేబినెట్ సమావేశానికి ఆలస్యంగా వచ్చిన నలుగురు మంత్రులపై సీఎం చంద్రబాబు సీరియస్ అయ్యారు. మంత్రివర్గ సమావేశానికి ఆలస్యంగా వస్తే ఎలా అని ప్రశ్నించారు. 

Follow us on , &

ఇవీ చదవండి