Breaking News

ఇద్దరు ఐఏఎస్ అధికారులకు హైకోర్టు నోటీసులు..


Published on: 11 Dec 2025 14:33  IST

ఆర్టీఐ చట్టం కింద సమాచారం ఇవ్వలేదంటూ దాఖలైన పిటిషన్‌పై ఇద్దరు ఐఏఎస్‌‌లకు తెలంగాణ హైకోర్టు నోటీసులు జారీ చేసింది. కోర్టు ఆదేశాలు ఉన్నా ఆర్టీఐ చట్టం కింద సమాచారం అందజేయలేదని మాజీ జీహెచ్ఎంసీ కమిషనర్ కె.ఇలంబర్తి, ప్రస్తుత జీహెచ్ఎంసీ కమిషనర్ ఆర్.వి కర్ణన్లకు హైకోర్టు నోటీసులు ఇచ్చింది. ఆర్టీఐ చట్టం ప్రకారం పిటిషనర్ అడిగిన సమాచారం ఇవ్వకపోవడంతో గతంలో సికింద్రాబాద్‌లోని రాంగోపాల్‌పేటకు చెందిన వడ్డం శ్యామ్ హైకోర్టు‌ను ఆశ్రయించారు.

Follow us on , &

ఇవీ చదవండి