Breaking News

కళ్యాణదుర్గం మున్సిపాలిటీ తెదేపా కైవసం


Published on: 11 Dec 2025 16:40  IST

అనంతపురం జిల్లా కళ్యాణదుర్గం మున్సిపాలిటీని తెదేపా కైవసం చేసుకుంది. ఉత్కంఠ పరిణామాల మధ్య మున్సిపల్‌ ఛైర్‌పర్సన్‌గా తలారి గౌతమి ఎన్నికయ్యారు. గురువారం ఉదయం స్థానిక మున్సిపల్‌ కార్యాలయంలో ఎన్నిక నిర్వహించారు. మొత్తం 24 మంది కౌన్సిలర్లు ఉండగా.. వైకాపా నుంచి 11 మంది, తెదేపా నుంచి 11 మంది హాజరయ్యారు. ఈ నేపథ్యంలో ఎక్స్‌అఫీషియో సభ్యులు కీలకంగా మారారు.

Follow us on , &

ఇవీ చదవండి