Breaking News

కేంద్రమంత్రి అశ్వినీ వైష్ణవ్‌తో లోకేష్ కీలక భేటీ..


Published on: 15 Dec 2025 17:40  IST

ఢిల్లీ పర్యటనలో మంత్రి నారా లోకేష్ బిజీబిజీగా ఉన్నారు. పలువురు కేంద్రమంత్రులను కలుస్తూ రాష్ట్రానికి సంబంధించిన పలు అంశాలపై చర్చిస్తున్నారు. అలాగే కేంద్రమంత్రి అశ్వినీ వైష్ణవ్‌తో మంత్రి లోకేష్ సమావేశమయ్యారు. వివిధ ప్రాజెక్టులపై చర్చించారు. ఏపీలో నైపుణ్య గణనకు సహకారం అందించాలని కేంద్రమంత్రిని కోరారు. రాష్ట్రంలో నైపుణ్య గణన కోసం అత్యాధునిక ఏఐ టెక్నాలజీతో రూపొందించిన నైపుణ్యం పోర్టల్ గురించి కేంద్రమంత్రికి వివరించారు.

Follow us on , &

ఇవీ చదవండి