Breaking News

వాజపేయి-బాబు మైత్రితోనే ఉమ్మడి రాష్ట్రాభివృద్ధి


Published on: 17 Dec 2025 12:22  IST

ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌ అభివృద్ధిలో మాజీ ప్రధాని వాజపేయి ముద్ర మరువలేనిదని..నాడు ప్రధాని, ముఖ్యమంత్రి హోదాలో ఉన్న వాజపేయి, చంద్రబాబు మైత్రితోనే ఏపీలో అనేక అభివృద్ధి పనులు పురుడుపోసుకున్నాయని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు పీవీఎన్‌ మాధవ్‌ పేర్కొన్నారు. అటల్‌, మోదీ సుపరిపాలన బస్సు యాత్ర మంగళవారం బాపట్లకు చేరుకోగా ఇంజనీరింగ్‌ కళాశాల సెంటర్‌లో ఏర్పాటు చేసిన వాజపేయి కాంస్య విగ్రహాన్ని మంత్రులు కొలుసు పార్థసారథి, అనగాని సత్యప్రసాద్‌తో కలిసి మాధవ్‌ ఆవిష్కరించారు.

Follow us on , &

ఇవీ చదవండి