Breaking News

రేషన్‌కార్డుదారులకు గట్టి హెచ్చరిక..


Published on: 18 Dec 2025 11:50  IST

రేషన్‌కార్డు దారులందరికీ ఈ-కేవైసీ తప్పనిసరి అని రాష్ట్ర పౌరసరఫరాల శాఖ స్పష్టం చేసింది. ఈ ప్రక్రియను పూర్తి చేయని కార్డులకు నూతన సంవత్సరం నుంచి సన్నబియ్యం కోటా నిలిపివేయనున్నట్లు కీలక ఆదేశాలు జారీ చేసింది. దీంతో రాష్ట్రవ్యాప్తంగా రేషన్ దుకాణాల వద్ద లబ్ధిదారుల రద్దీ పెరుగుతోంది. రేషన్ కార్డుల్లో నమోదైన కుటుంబ సభ్యులంతా సమీపంలోని రేషన్ దుకాణాలకు వెళ్లి ఈ-పాస్ యంత్రంలో బయోమెట్రిక్ వేలిముద్రలు వేసి ఈ-కేవైసీ పూర్తి చేయాలి. 

Follow us on , &

ఇవీ చదవండి