Breaking News

పుస్తక ప్రియులకు అలర్ట్..


Published on: 19 Dec 2025 12:08  IST

హైదరాబాద్‌ 38వ బుక్‌ఫెయిర్‌కు ఎన్టీఆర్‌ స్టేడియం ముస్తాబైంది. ఈ రోజు నుంచి అంటే డిసెంబర్‌ 19 నుంచి డిసెంబర్‌ 29వ తేదీ వరకు మొత్తం 11 రోజుల పాటు ఈ పుస్తక మహోత్సవం జరగనుంది. ఆయా తేదీల్లో మధ్యాహ్నం 1 గంట నుంచి రాత్రి 9 గంటల వరకు పుస్తక ప్రదర్శన జరుగుతుంది. విద్యార్థులకు ప్రవేశం పూర్తిగా ఉచితం. కేజీ నుంచి పీజీ స్థాయి విద్యార్ధుల వరకు ఉచిత ప్రవేశ సదుపాయం కల్పించినట్లు బుక్‌ఫెయిర్‌ కమిటీ కార్యదర్శి వాసు తెలిపారు. మిగతా సందర్శకులకు ఎంట్రీ ఫీజు రూ.10 ఉంటుంది. 

Follow us on , &

ఇవీ చదవండి