Breaking News

టీటీడీ మాజీ చైర్మన్‌ కుమారుడు,కుమార్తె అరెస్టు


Published on: 23 Dec 2025 12:24  IST

రియల్‌ ఎస్టేట్‌ వ్యాపారి రఘునాథ్‌ అనుమానాస్పద మృతి కేసులో టీటీడీ మాజీ చైర్మన్‌ ఆదికేశవులు నాయుడు కుమారుడు శ్రీనివాస్‌, కుమార్తె కల్పజ, డీఎస్పీ మోహన్‌ను సీబీఐ అధికారులు సోమవారం అరెస్టు చేశారు. రఘునాథ్‌.. కర్ణాటక, ఆంధ్రప్రదేశ్‌లో ఎక్కువగా భూముల విక్రయాలు చేసేవారు. బెంగళూరు వైట్‌ ఫీల్డ్‌ లోని నిందితుల గెస్ట్‌హౌ్‌సలో ఆయన 2019 మేలో ఉరి వేసుకున్న స్థితిలో కనిపించారు. తన భర్తను కిడ్నాప్‌ చేసి హత్య చేశారని రఘునాథ్‌ భార్య మంజుల పోలీసులకు ఫిర్యాదు చేశారు.

Follow us on , &

ఇవీ చదవండి