Breaking News

బిహార్‌లోని నీతీశ్‌ పాలనపై శశిథరూర్‌ ప్రశంసలు..!


Published on: 23 Dec 2025 16:22  IST

కేంద్రంలోని భాజపాపై ప్రశంసలు కురిపిస్తూ.. ప్రతిపక్ష కాంగ్రెస్‌ పార్టీ సీనియర్‌ నేత శశిథరూర్‌ నిత్యం వార్తల్లో నిలుస్తుంటారు. తాజాగా బిహార్‌లోని ఎన్డీయే కూటమి పాలనను అభినందించారు. రాష్ట్రంలో మౌలిక వసతుల కల్పనపై ప్రభుత్వం ఎక్కువగా దృష్టి పెట్టిందన్నారు. థరూర్‌ బిహార్‌లో పర్యటించారు. ఈ సందర్భంగా ఓ వార్తా సంస్థతో మాట్లాడుతూ ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. ఇంతకుముందు తాను విన్న దానికంటే బిహార్‌లో మౌలిక సదుపాయాలు మెరుగ్గా ఉన్నాయన్నారు. రోడ్లు బాగున్నాయన్నారు.

Follow us on , &

ఇవీ చదవండి