Breaking News

ఆదంపుర్‌ ఎయిర్‌బేస్‌కు వెళ్లిన ప్రధాని మోదీ


Published on: 13 May 2025 14:15  IST

పహల్గాం ఉగ్రదాడికి ప్రతిగా మన భద్రతా బలగాలు ఉగ్రస్థావరాలపై ఆపరేషన్ సిందూర్‌ను నిర్వహించాయి.పాక్ టార్గెట్ చేయాలని యత్నించిన వాటిలో ఆదంపుర్‌ వైమానిక స్థావరం కూడా ఒకటి.‘‘ఈ ఉదయం నేను ఆదంపుర్ ఎయిర్‌బేస్‌కు వెళ్లాను.అక్కడ మన పోరాటయోధులను కలిశాను. ధైర్యం, దృఢ సంకల్పానికి ప్రతిరూపంగా నిలిచేవారితో మాట్లాడటం ఒక ప్రత్యేక అనుభవం. మన దేశ రక్షణ కోసం బలగాలు చేసే ప్రతిచర్యకు ప్రజలందరూ ఎప్పటికీ కృతజ్ఞతతో ఉంటారు’’ అని ఎక్స్‌ వేదికగా మోదీ రాసుకొచ్చారు.

Follow us on , &

ఇవీ చదవండి