Breaking News

పెను విషాదం.. 14 మంది మృతి.. ఆరుగురి పరిస్థితి విషమం


Published on: 13 May 2025 15:05  IST

పంజాబ్‌లోని అమృత్‌సర్‌లో ఘోర విషాదం చోటు చేసుకుంది. కల్తీ మద్యం తాగి 14 మంది చనిపోయారు. మరో ఆరుగురి పరిస్థితి విషమంగా ఉంది. ఇందుకు సంబంధించిన పూర్తి వివరాల్లోకి వెళితే.. సోమవారం అమృత్‌సర్ మజితా బ్లాక్‌లోని భంగాలి కలన్, తారీవాల్, సంఘ, మరారి కలన్ గ్రామాలకు చెందిన కొంతమంది ప్రజలు మద్యం తాగిన కొద్దిసేపటికే అస్వస్థతకు గురయ్యారు. వారిని దగ్గరలోని అమృత్‌సర్ సివిల్ ఆస్పత్రికి తరలించారు. చికిత్స పొందుతూ 14 మంది చనిపోయారు. మరో ఆరుగురి పరిస్థితి విషమంగా ఉంది.

Follow us on , &

ఇవీ చదవండి