Breaking News

పాక్‌ షెల్లింగ్‌కు విరుగుడుగా జమ్మూకశ్మీర్లో 9,500 బంకర్లు.


Published on: 14 May 2025 15:52  IST

ఆపరేషన్‌ సిందూర్‌ తర్వాత పాక్‌ దళాలు సరిహద్దుల వెంట విచక్షణారహితంగా దాడులు నిర్వహించడం మొదలుపెట్టాయి. ఈ దాడుల్లో పలు ప్రార్థనా మందిరాలు కూడా దెబ్బతిన్నాయి. ముఖ్యంగా కుప్వారా, ఉరి, పూంఛ్‌ల్లో పాక్‌ షెల్లింగ్‌ తీవ్రస్థాయిలో జరిగింది.పాక్‌ సైన్యం షెల్లింగ్‌ నుంచి సరిహద్దు గ్రామాల వారిని కాపాడేందుకు దాదాపు 9,500 బంకర్లు ఏర్పాటుచేసినట్లు జమ్మూకశ్మీర్‌ చీఫ్‌ సెక్రటరీ అటల్‌ దుల్లూ వెల్లడించారు. ఆయన నిన్న రాజౌరీలోని సరిహద్దు ప్రాంతాలను సందర్శించారు.

Follow us on , &

ఇవీ చదవండి