Breaking News

పార్వతీపురం జిల్లాలో ఆర్టీసీ బస్సుకు అగ్నిప్రమాదం – ప్రాణనష్టం తప్పింది

పార్వతీపురం జిల్లాలో ఆర్టీసీ బస్సుకు అగ్నిప్రమాదం – ప్రాణనష్టం తప్పింది


Published on: 06 Nov 2025 10:02  IST

పార్వతీపురం మన్యం జిల్లాలోని పాచిపెంట మండలం రొడ్డవలస సమీపంలో ఒక ఘోర ప్రమాదం తప్పింది. విశాఖపట్నం నుంచి జయపుర వైపు వెళ్తున్న ఒడిశా ఆర్టీసీ బస్సు ఉదయం 7.45 గంటల సమయంలో అకస్మాత్తుగా మంటలు ఎగసిపడింది. బస్సు ఇంజిన్‌ నుంచి పొగలు రావడం గమనించిన డ్రైవర్‌ అప్రమత్తమై వాహనాన్ని ఆపి, ప్రయాణికులను కిందకు దింపాడు. ఈ సమయానికి బస్సులో ఐదుగురు మాత్రమే ఉండగా, అందరూ సురక్షితంగా బయటపడ్డారు. వెంటనే అగ్నిమాపక సిబ్బంది సంఘటనా స్థలానికి చేరుకొని మంటలను అదుపులోకి తెచ్చారు.

ఈ ఘటనపై రాష్ట్ర మంత్రి సంధ్యారాణి స్పందించారు. ఆమె అధికారులను ఫోన్‌లో సంప్రదించి వివరాలు తెలుసుకుని, వెంటనే అగ్నిమాపక వాహనాన్ని అక్కడికి పంపించారు. ప్రమాదంపై పూర్తి స్థాయిలో దర్యాప్తు చేసి నివేదిక సమర్పించాలని ఆదేశించారు. అధికారులు ఈ ఘటనలో ఎలాంటి ప్రాణనష్టం జరగలేదని మంత్రికి వివరించారు.

Follow us on , &

ఇవీ చదవండి