Breaking News

ప్రభాకర్ రావుకు ఇంటికి పోలీసులు.. ఎందుకంటే


Published on: 22 May 2025 18:41  IST

ఫోన్ ట్యాపింగ్ కేసులో మరో కీలక పరిణామం చోటు చేసుకుంది. ఈ కేసులో ఎస్‌ఐబీ మాజీ చీఫ్ ప్రభాకర్‌ రావు ఇంటికి సిట్ టీమ్ చేరుకుని నోటీసులు అంటించారు. ప్రభాకర్ ‌రావును ప్రొక్లయిమ్డ్ అఫెండర్‌గా ప్రకటించాలని నాంపల్లి కోర్టును పోలీసులు కోరారు. దీనికి సంబంధించి జనవరిలో పోలీసులు పిటిషన్ వేశారు. దీనిపై విచారించిన న్యాయస్థానం రెండు రోజుల క్రితం కీలకమైన ఆదేశాలు ఇచ్చింది. ప్రభాకర్ రావు గడువులోపు న్యాయస్థానం ఎదుట హాజరుకావాలని ఆదేశించింది.

Follow us on , &

ఇవీ చదవండి