Breaking News

ఫోన్ ట్యాపింగ్‌ కేసులో సంచలన విషయాలు..?


Published on: 25 Jun 2025 18:41  IST

ఫోన్ ట్యాపింగ్ కేసులో సిట్ విచారణకు కాంగ్రెస్ ఎమ్మెల్సీ బల్మూరి వెంకట్ ఇవాళ(బుధవారం) జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్‌లో హాజరయ్యారు. బల్మూరి వెంకట్ స్టేట్‌మెంట్‌ని సిట్ అధికారులు రికార్డ్ చేశారు. ఈ సందర్భంగా బల్మూరి వెంకట్ మీడియాతో మాట్లాడారు. గత బీఆర్ఎస్ ప్రభుత్వం రాజకీయం కోసం నీచానికి దిగిందని మండిపడ్డారు. కుటుంబ సభ్యుల ఫోన్లు కూడా వినడం దారుణమని ఫైర్ అయ్యారు. ఫోన్లు ట్యాపింగ్ చేసి సంభాషణలు విని తమను ఇబ్బందులకు గురి చేశారని ధ్వజమెత్తారు.

Follow us on , &

ఇవీ చదవండి