Breaking News

కోల్‌కతాలో విద్యార్థినిపై సామూహిక అత్యాచారం


Published on: 27 Jun 2025 14:12  IST

పశ్చిమ బెంగాల్‌ రాష్ట్రం కోల్‌కతా (Kolkata)లో మరో దారుణ ఘటన చోటు చేసుకుంది. కస్బా పరిసరాల్లో ఓ న్యాయ విద్యార్థిని (Law Student)పై సామూహిక అత్యాచారం జరిగింది. బుధవారం రాత్రి 7:30 నుంచి 8:50 గంటల మధ్య కాలేజ్‌ క్యాంపస్‌ (Law College In Kolkata)లో ఈ ఘటన జరిగినట్లు తెలుస్తోంది. ఈ కేసులో ఇప్పటి వరకూ ముగ్గురు వ్యక్తులను అరెస్ట్‌ చేసినట్లు పోలీసులు తెలిపారు. అరెస్టైన వారిలో ఇద్దరు విద్యార్థులు కాగా, మరో వ్యక్తి కళాశాల సిబ్బందిగా పేర్కొన్నారు.

Follow us on , &

ఇవీ చదవండి