Breaking News

ట్రేడింగ్‌లో అధిక లాభాలంటూ..


Published on: 16 Jul 2025 12:48  IST

ట్రేడింగ్‌లో పెట్టుబడులు పెడితే అధిక లాభాలు ఆర్జించవచ్చని ఓ వృద్ధురాలిని నమ్మించి రూ.57.43లక్షలను సైబర్‌ నేరగాళ్లు కొల్లగొట్టారు. మోసపోయినట్లు ఆలస్యంగా గుర్తించిన బాధితురాలు సిటీ సైబర్‌ క్రైమ్‌ పోలీసులకు ఫిర్యాదు చేసింది. డీసీపీ ధార కవిత తెలిపిన వివరాలిలా ఉన్నాయి. జూబ్లీహిల్స్‌కు చెందిన 60 ఏళ్ల వృద్ధురాలికి ఇన్‌స్టాగ్రామ్‌లో ఎఫ్‌ఎక్స్‌ రోడ్‌ పేరుతో ఆన్‌లైన్‌ ట్రేడింగ్‌ ప్రకటన కనిపించింది.ఆమెతో పెద్ద మొత్తంలో పెట్టుబడులు పెట్టిస్తూ విడతల వారీగా రూ.57.43లక్షల వరకు పెట్టించారు.

Follow us on , &

ఇవీ చదవండి