Breaking News

అమిత్ షాతో బనకచర్ల ప్రాజెక్ట్ పై సీఎం చంద్రబాబు చర్చ


Published on: 16 Jul 2025 17:15  IST

ఢిల్లీ పర్యటనలో ఉన్న సీఎం చంద్రబాబు కేంద్ర హోంమంత్రి అమిత్ షాను కలిశారు. ఆయనతో సమావేశం అయ్యారు. సుమారు 40 నిమిషాలు అమిత్ షా తో చర్చలు జరిపారు చంద్రబాబు.పోలవరం బనకచర్ల లింక్ ప్రాజెక్ట్ అంశాన్ని కేంద్ర హోంమంత్రి అమిత్ షా దగ్గర ప్రస్తావించారు ఏపీ సీఎం చంద్రబాబు. అమిత్ షాతో భేటీ అయిన చంద్రబాబు బనకచర్ల ప్రాజెక్ట్ ప్రతిపాదనలను వివరించారు. గోదావరి మిగులు జలాలను గోదావరి పరివాహకంలోని చివరి రాష్ట్రంగా వినియోగించుకునే హక్కు ఏపీకి ఉందని తెలిపారు.

Follow us on , &

ఇవీ చదవండి