Breaking News

కేజీ వెండి 3 వేల రూపాయలు తగ్గింది..


Published on: 24 Oct 2025 15:41  IST

మొన్నటిదాకా పరుగు పెట్టిన బంగారం, వెండి ధరలు కొద్దిరోజులుగా తగ్గుతూ వస్తున్నాయి.. గత తొమ్మిది రోజులుగా తగ్గుతూ వస్తున్న వెండి ఇవాళ ( అక్టోబర్ 24 ) కూడా భారీగా తగ్గింది. శుక్రవారం కిలో వెండి రూ. 3 వేలు తగ్గింది. ఈ క్రమంలో తొమ్మిది రోజుల్లో కిలో వెండి రూ. 36 వేలు తగ్గింది. పదిరోజుల క్రితం రూ. రెండు లక్షల మార్క్ దాటిన వెండి ఇవాళ మూడు వేలు తగ్గి రూ. లక్షా 71 వేలకు చేరింది. వెండి ధరలు వరుసగా తగ్గుతున్న క్రమంలో హర్షం వ్యక్తం చేస్తున్నారు జనం.

Follow us on , &

ఇవీ చదవండి