Breaking News

శ్రీరంగనాథస్వామివారికి పట్టువస్త్రాల సమర్పణ


Published on: 01 Dec 2025 18:11  IST

తమిళనాడు రాష్ట్రంలో ప్రముఖ వైష్ణవ క్షేత్రమైన శ్రీరంగంలోని శ్రీ రంగనాథస్వామి వారికి సోమవారం టీటీడీ చైర్మన్ బీఆర్ నాయుడు దంపతులు పట్టువస్త్రాలు సమర్పించారు.ముందుగా ఆలయం వద్దకు చేరుకున్న చైర్మన్‌కు శ్రీరంగం ఆలయ జాయింట్‌ కమిషనర్‌ పి.శివరామన్‌, ప్రధానార్చకులు సుందరభట్టర్‌ సంప్రదాయబద్ధంగా స్వాగతం పలికారు.దర్శనానంతరం ఆలయ అధికారులు స్వామివారి తీర్థప్రసాదాలను చైర్మన్‌కు అందజేశారు. 2006వ సంవత్సరం నుంచి శ్రీరంగం ఆలయానికి టీటీడీ పట్టువస్త్రాలు సమర్పిస్తోంది.

Follow us on , &

ఇవీ చదవండి