Breaking News

ఏపీలో రైతులకు గుడ్‌న్యూస్..


Published on: 15 Dec 2025 17:49  IST

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కౌలు రైతులకు గుడ్ న్యూస్ చెప్పింది. సాగు పెట్టుబడి కోసం రూ. లక్ష వరకు రుణాలు ఇవ్వాలని నిర్ణయించింది. పీఏసీఎస్‌ల ద్వారా ఈ రుణాలు మంజూరు చేయనున్నారు. కౌలు రైతులను మరింత ప్రోత్సహించే ప్రణాళికలో భాగంగా అర్హులైన కౌలు రైతులకు రూ.లక్ష వరకు రుణాలు ఇచ్చేందుకు రంగం సిద్ధం చేస్తోంది.ఆయా ప్రాంతాల్లోని ప్రాథమిక వ్యవసాయ సహకార పరపతి సంఘాల నుంచి రుణాలు అందించాలని ప్రభుత్వం నిర్ణయించింది.

Follow us on , &

ఇవీ చదవండి