Breaking News

టీటీడీ పరకామణి కేసు..హైకోర్టు కీలక ఆదేశాలు


Published on: 16 Dec 2025 14:49  IST

టీటీడీ పరకామణి చోరీ కేసుపై ఆంధ్రప్రదేశ్ హైకోర్టులో (AP High Court) ఇవాళ(మంగళవారం) విచారణ జరిగింది. ఈ సందర్భంగా ఇరుపక్షాల న్యాయవాదుల మధ్య వాదోపవాదనలు జరిగాయి. ఈ సందర్భంగా హైకోర్టు పలు కీలక సూచనలు చేసింది. తిరుమల శ్రీవారి పరకామణిలో జరిగే చోరీలను సాధారణ దొంగతనంగా చూడటానికి వీల్లేదని స్పష్టం చేసింది ఏపీ హైకోర్టు.కానుకల రూపేణా వచ్చిన సొమ్ము చోరీకి గురయితే కోట్లాదిమంది భక్తుల మనోభావాలు దెబ్బతింటాయని హైకోర్టు తెలిపింది

Follow us on , &

ఇవీ చదవండి